calender_icon.png 1 October, 2024 | 10:35 AM

పారాలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డకు కాంస్యం.. సీఎం అభినందనలు

04-09-2024 11:03:18 AM

హైదరాబాద్: పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్ 2024లో మన దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన జీవాంజి దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. పారాలింపిక్స్ 2024లో మెడల్స్ సాధించిన భారత అథ్లెట్స్, ప్లేయర్స్ అందరికీ ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.