calender_icon.png 21 October, 2024 | 4:14 PM

గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

21-10-2024 01:59:20 PM

హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని  సూచించారు. పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు  కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్షా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు.