హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్షా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు.