హైదరాబాద్: సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత తనకు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని సీఎం సూచించారు. 2018 డిసెంబర్ లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేసీఆర్.. కేంద్రానికి చెప్పారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు.