calender_icon.png 3 October, 2024 | 4:40 PM

మూసీ రివర్ ఫ్రంట్ వద్దా?.. కిషన్ రెడ్డి, ఈటల మీరే చెప్పాలి..?

03-10-2024 01:49:04 PM

హైదరాబాద్: కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ మీకు మోడీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? అని సీఎం ప్రశ్నించారు. కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని కాపాడుకుందామని సీఎం పిలుపునిచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు సచివాలయానికి రండి.. నాలుగు రోజులు చర్చిద్దామన్నారు. ఈ ప్రభుత్వం పేదల కన్నీళ్లు చూడదలచుకోలేదని సీఎం చెప్పారు. మూసీ నిర్వాసితులకు ఎలా ఆదుకోవాలో సూచనలు ఇవ్వండి. ఈటల రాజేందర్ మీ నేతృత్వంలోనే నిధుల కోసం మోడీ వద్దకు వెళ్తామని సీఎం కోరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తీసుకుని రండి.. రూ. 25 వేల కోట్లు ఇప్పించండి అని రేవంత్ కోరారు. హైదరాబాద్ నగరంలో చెరువులు ఆక్రమించిందెవరో తేల్చుదామన్నారు. మూసీ నది వల్ల నల్గొండ ప్రజలు విషాన్ని మింగుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.