calender_icon.png 3 October, 2024 | 4:51 PM

హైదరాబాద్ లో మీ భరతం పడతాం

03-10-2024 01:30:59 PM

హైదరాబాద్: మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు.. హైదరాబాద్ లో మీ భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రాపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పుడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్లు కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది? అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం.. వచ్చి సలహాలు ఇవ్వండని తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు, సబిత కమారుల ఫామ్ హౌస్ లు కూల్చాలా? వద్దా? చెప్పండన్నారు. ఫామ్ హౌస్ లు కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.