హైదరాబాద్: హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్ ఆదివారం జరిగింది. ఐఎస్బీ నాయకత్వ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వికేక్ రాంచౌదరి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 2025 బ్యాచ్ ఈ ఈవెంట్ను హోస్ట్ చేస్తుంది. ఐఎస్ బీ లీడర్షిప్ సమ్మిట్ అనేది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్. ఈ సమ్మిట్ హైదరాబాద్, మొహాలీలోని దాని క్యాంపస్లలో నిర్వహించబడుతుంది.