calender_icon.png 23 September, 2024 | 7:01 AM

కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోతేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి

15-09-2024 05:29:22 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో మహిళలు ఇప్పటివరకు 85 కోట్ల ప్రయాణాలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే హామీలు అమలు చేయడం ప్రారంభించామన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచి మహిళలకు భారంగా మార్చిందని, గ్యాస్ సిలిండర్ మూలకు పడటంతో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రకారం పంద్రాగస్టులోపే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు.

వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దని, రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకులో చెల్లిస్తే... రూ.2 లక్షల రుణమాఫీ పూర్తవుతుందని ముఖ్యమంత్రి సూచించారు. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోతేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాం.. ఇపపటికే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చి విద్యార్థులకు ఎంతో మేలు చేశామని, కరెంట్ బిల్లులకు భయపడి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు వాడలేదన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చి విద్యార్థులకు ఎంతో మేలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.