20-03-2025 07:22:46 PM
బైంసా (విజయక్రాంతి): ముధోల్ కు చెందిన రజియా బేగమ్ కు ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల ఆర్థిక సహాయం ఎల్ ఓసిని మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఆమెకు అందజేశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు... ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న విట్టల్ రెడ్డి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధి నుంచి వైద్యం కోసం అవసరమైన నిధులను మంజూరు మంజూరు చేయించిన ఆయన గురువారం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఎల్ఓసిని అందజేశారు.