calender_icon.png 7 October, 2024 | 12:00 PM

సోషల్ మీడియాలో సీఎం మార్ఫింగ్ ఫొటోలు

06-10-2024 12:00:00 AM

ఇద్దరు నిందితుల అరెస్ట్  

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి):  రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన ఫొటోలను అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసి ‘కేటీఆర్ సేన రంగారెడ్డి’ అనే వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన గడ్డం అనిల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా కొందూర్గ్ గ్రామానికి చెందిన కశామోని రమేశ్‌ను అదుపు లోకి తీసుకొన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.