ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (విజయక్రాంతి): ఎన్నికల హామీలను సీఎం రేవంత్రెడ్డి విస్మరించారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం శనివారం ఆమె జిల్లాకేంద్రంలో ఎన్నికల ప్రచారంచేశారు. ఆత్రం సక్కుని ఎన్నికల్లో గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారంలో పార్టీ నేతలు మర్సుకోల సరస్వతి, అలీబిన్ హైమద్, కోవ సాయినాథ్, ఇర్ఫాన్, రవి, ఆశోక్, వెంకన్న, నిసార్, అహ్మద్ పాల్గొన్నారు.