13-03-2025 12:00:00 AM
మద్నూర్, మార్చి 12 ః హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని, ఇందిరానగర్ కాలనీ చెందిన విశ్వజిత్ కాంబ్లెకు హిందీ జూనియర్ లెక్చరర్గా మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టింగ్ ఇచ్చారు. మద్నూర్ మండలంలోని ఖరగ్ గ్రామానికి చెందిన డి.జ్ఞానేశ్వర్కు జూనియర్ లెక్చరర్గా నారాయణఖేడ్ లో పోస్టింగ్ ఇచ్చారు మద్నూర్ మండలంలోనిగోజెగావ్ గ్రామానికి చెందిన సంభాజకి హిందీ జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారిలో పోస్టింగ్ ఇచ్చారు.వీరందరూ కూడా హిందీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికయ్యారు.