అమరావతి: మంగళగిరి కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రంలోని వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్ , మంత్రులు, స్థానిక ఎంపీలు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా, పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.