calender_icon.png 28 October, 2024 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి

13-07-2024 10:49:13 AM

అమరావతి: కొలనుకొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి, ప్రతి రోజు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని, తెలుగు జాతికి సేవ చేయటానికి, పేదరికం లేకుండా చేయటానికి, నాకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వమని కోరుకుంటానన్నారు. పేదరికంలో ఉన్న వారికి చేయూత ఇవ్వటం మనందరి బాధ్యత అన్నారు. 

అక్షయ పాత్ర ద్వారా నాడు పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, కక్ష కట్టి అవి మూసేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మళ్ళీ పేదల కోసం అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసిందని ఆరోపించారు. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత 5 ఏళ్ళలో జరిగింది. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదని సీఎం వెల్లడించారు.