మెదక్, విజయక్రాంతి: మెదక్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద పాల్గొన్నారు. లోక్ అదాలత్లో 3,034 కేసులు రాజీ కుదర్చినట్లు తెలిపారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలోవారు మొక్కలు నాటా రు. జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి లక్ష్మీ శారద, సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, న్యాయవాదులు పాల్గొన్నారు.