న్యూఢిల్లీ, అక్టోబర్ 22: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బుచ్కు కేంద్ర ఆర్థిక శాఖ క్లీన్చిట్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బుచ్పై వెల్లువెత్తిన ఆరోపణలపై ఆర్థిక శాఖ దర్యాప్తు చేసింది. బుచ్ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినందున, ఆమెపై ఎటు వంటి చర్యలూ ఉండబోవని, పూర్తి పదవీకాలం సెబీ చైర్పర్సన్గా కొనసాగుతారని ఆ వర్గాల్ని ఉటంకిస్తూ ఒక అంగ్లచానల్ పేర్కొంది.
బుచ్ పదవీ కాలం 2025 ఫిబ్రవరితో ముగియనుంది. యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ సెబీ చీఫ్పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందీ విదితమే.