18-03-2025 12:00:00 AM
కేసముద్రం మండల అధ్యక్షుడిగా ఎలేందర్
మహబూబాబాద్. మార్చి 17 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ జాయిం ట్ యాక్షన్ కమిటీ కేసముద్రం మండ ల అధ్యక్షుడిగా కేసముద్రం స్టేషన్ కు చెందిన చెడుపల్లి ఎలేందర్ నియమితులయ్యారు.ఈ మేరకు ఎస్సీ వర్గీక రణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య నియామక పత్రాన్ని సోమవారం చెడుపల్లి ఎలేందర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా చెడుపల్లి ఏలేందర్ మాట్లా డుతూ.. తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని, తన నియామ కానికి సహకరించిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ పులిగిల్ల బాలయ్య, వైస్ చైర్మన్ నత్తి కొర్నెల్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పందుల సారయ్య, కేసముద్రం మార్కెట్ చైర్మన్ సంజీవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు డు అల్లం నాగేశ్వర్ రావు, కేసముద్రం టౌన్ అధ్యక్షులు రావుల మురళి, సీనియర్ నాయకులు బండారి దయా కర్లకు కృతజ్ఞతలు తెలిపారు.