calender_icon.png 30 September, 2024 | 5:58 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

30-09-2024 02:05:49 AM

తిరుమల, సెప్టెంబర్ 29: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఆయనకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించా రు. రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. తితిదే ఈవో ఆయనకు స్వామివారి ఫొటో, తీర్థప్రసాదాలు అందజేశారు.