29-03-2025 01:29:02 AM
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్ సప్లె ఎన్పోర్స్ మెంట్ అధికారులు శుక్రవారం కస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ సివిల్ సప్లె కమీషన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లె ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎఫ్సీఐ అధికారులు మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి మోడ్రన్ పారాబాయిల్డ్ రైస్ అండ్ మిల్లులో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. సివిల్ సప్లెకి సంబంధించిన 2022-23 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం నిల్వలపై, ఎఫ్సీఐకి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించి ధాన్యం, బియ్యం నిల్వలపై అధికారులు తనిఖీ చేశారు.
మొదటగా సూరయ్యపల్లిలోని శ్రీ లక్ష్మి మోడ్రన్ పారాబాయిల్డ్ రైస్ అండ్ మిల్లులో తనిఖీ చేయడంలో మిల్లులో నిలువ ఉన్న ఎఫ్సీఐకి సంబంధించిన బియ్యం, ధాన్యం నిల్వలను తనిఖీ చేశారు. ఆనంతరం గంగాపురిలోని సత్యసాయి రైస్ లో నిలువ ఉంచిన స్టాక్ను పరిశీలించారు. ఈ తనిల్లో 41,365.27 క్వింటాళ్ల ధాన్యంకు గాను 9689.8 కింటాళ్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయి. మిగతా 31675.47క్వింటాళ్ల ధాన్యం స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఎఫ్సీఐకి సంబంధించి 2023-24 రబీ సీజన్కు సంబంధించి 19,339 క్వింటాళ్లు మొత్తం ధాన్యం, బియ్యం నిలువ ఉన్నట్లు గుర్తించారు. కాగా తనిఖీలు నిర్వహిస్తున్న మిల్లు యజమాని సత్యనారాయణ అధికారులతో పలుసార్లు వాగ్వాదానికి దిగారు. ఈ దాడిలో సివిల్ సప్లె టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్, స్పెషల్ ఆఫీసర్ లకేష్మారెడ్డి, సివిల్ సప్లె ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ జంగయ్య, సివిల్ సప్లై పెద్దపల్లి డీటీ సంతోష్సింగ్, సివిల్ సప్లె ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.