calender_icon.png 19 October, 2024 | 9:11 AM

ఏసీబీ వలలో పౌరసరఫరాల శాఖ సెక్షన్ ఆఫీసర్

19-10-2024 12:00:00 AM

15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. నగరంలోని పౌరసరఫరాల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్ అలెగ్జాండర్ ఓ వ్యక్తికి పెన్షన్ దస్త్రాలకు అనుమతి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో శుక్రవారం విక్రమ్ అలెగ్జాండర్‌కు బాధితుడు రూ. 15 వేలు లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం విక్రమ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.