జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 8 (విజయక్రాంతి): బెటాలియన్ 58 సీఆర్పీఎఫ్ జవాన్లు గురువారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్, మహాముత్తారం మండలం మద్దిమడుగు గొత్తికోయగూడెంలో సివిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్పీ కిరణ్ఖరే ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ కమాండెంట్ మోహన్ సహకారంతో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు బాస్కెట్బాల్, క్యారం బోర్డులు, వాలీబాల్ కిట్లు, మహిళలకు కుట్టు మిషన్లు, వాటర్ ట్యాంకులు, సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సంజయ్ కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఆర్పీఎఫ్ డీఎస్పీ రామకృష్ణన్ మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.