21-02-2025 06:52:42 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికవర్గ ప్రయోజనాలు పరిరక్షణ కోసం హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాల నిర్వహిస్తూ ఏరియాలో సిఐటియు బలమైన కార్మిక సంఘంగా అవతరిస్తుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి స్పష్టం చేశారు. ఏరియాలోని కాసిపేట1 గనిపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన కార్మికుల నుద్దేశించి మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా సిఐటియు ఆద్వర్యంలో సొంతింటి కలపై చేస్తున్న పోరాటంతో పాటు ఏరియాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రధాన ప్రతిపక్ష యూనియన్ గా సిఐటియు చేపడుతున్న ఆందోళనలను గమనిస్తున్న కార్మికులు పోరాటంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతామని ముందుకు వస్తున్నారని అన్నారు.
ఏరియాలోని ప్రతి గని నుండి స్వచ్ఛందంగా కార్మికులు ముందుకు వచ్చి యూనియన్ లో చేరుతూ బలోపేతం చేస్తున్నారని అన్నారు. అవినీతి పెరవీలు లేకుండా నిజాయితీగా యాజమాన్యంపై పోరాడుతున్న సిఐటియును కార్మికులు మరింతగా ఆదరించాలని కోరారు. ఎన్నికల సమయంలో గనులపై బాట బూట్లు ఇప్పిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు పాత కంపెనీకి చెందిన బూట్లు ఇస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం కృషి చేయాలని లేకుంటే తమ యూనియన్ ఆధ్వర్యంలో ఉదృతం చేస్తామన్నారు. ఈ సందర్బంగా కాసిపేట 1 గనికి చెందిన అమీర్, నవీన్ లు యూనియన్ లో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ దెబ్బటి తిరుపతి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నాగవెల్లి శ్రీధర్, కందుగుల రమేష్, ఏరియా సీనియర్ నాయకులు అలవాల సంజీవ్ లు పాల్గొన్నారు.