13-03-2025 07:39:23 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): హోలీ పండుగ(Holi Festival)ను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని భిక్కనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్(Bhiknoor Circle Inspector Sampath Kumar) సూచించారు. దోమకొండ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కృత్రిమ రంగులలో చల్లుకోవద్దని సూచించారు హోలీ పండుగ సందర్భంగా యువకులు మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో పండగను చేసుకోవాలన్నారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లి స్నానాలు చేయవద్దని సూచించారు.