12-03-2025 09:18:55 PM
బేగంపేటలో అవగాహన సదస్సులో మంథని సీఐ రాజు
మంథని,(విజయక్రాంతి): గంజాయి, మత్తు పదార్థాలు అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ రాజు హెచ్చరించారు. రామగిరి మండలంలోని బేగంపేటలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిఐ పాల్గోని మాట్లాడారు. గ్రామాల్లో ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కల్పిస్తే వెంటనే 100(వంద)కు డయల్ చేయాలని, మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఫోన్ లో మీ ఓటీపీలు లేదా ఎకౌంటు నంబర్ చెప్పండనే కాల్స్ కు స్పందించవద్దని సైబర్ మాయవల్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బేగంపేటలో గంజాయి, మత్తు పదార్థాలు, గుడుంబా అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని, వాహన సంబంధిత పత్రాలు లేకుంటే ఫైన్ వేసి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామాల్లో పోలీస్ నిరంతరం నిఘా ఉంచామని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దివ్య, కానిస్టేబుల్ శరత్ సిబ్బంది పాల్గొన్నారు.