- ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి యత్నం
- పోక్సో కేసు నమోదు
జనగామ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కూతురు వయసున్న ఓ బాలికపై ఆ పోలీసు కన్నుపడింది. రక్షణగా నిలివాల్సిన రక్షకభటుడే భక్షకుడిగా మారిన ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించిన ఓ సీఐపై కాజీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మామునూర్ సీఐగా పనిచేసిన రవికుమార్ ఇటీవలే నార్త్ జోన్ ఐజీ 1కు అటాచ్ అయ్యారు.
కాజీపేట పోలీ స్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్నగర్కు చెందిన ఓ బాలికపై సీఐ కన్నేశాడు. మంగళవారం మధ్యాహ్నం బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఆమెపై అఘాయి త్యానికి ప్రయత్నించడంతో బాధితురాలు ప్రతిఘటించింది. దీంతో రవికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బుధవారం కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కాజీపేట ఎస్సై లవణ్కుమార్ పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ హోదాలో పనిచేసిన అధికారిపై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది.