రాజేంద్రనగర్, విజయక్రాంతి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. అత్యాచారం, పోక్సో కేసు నమోదు కావడంతో ఆయన గత 36 రోజులుగా చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అవకాశాల పేరుతో తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంతో గురువారం న్యాయమూర్తి మంజూరు చేసిన విషయం విదితమే. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్ తన ఇంటికి వెళ్లారు.