02-03-2025 02:07:06 PM
చిట్యాల,(విజయక్రాంతి): ఇటీవలే నూతనంగా ఎన్నికైన చిట్యాల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఆదివారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన అధ్యక్షుడు కాట్రైవుల ఐలయ్య,ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్ లను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకపోగా సానుకూలంగా స్పందించారు. నాణ్యమైన వార్తలను అందిచాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి రామచంద్రమూర్తి, పుల్ల రవి తేజ,బోళ్ల రాజేందర్,కట్కూరి శ్రీనివాస్, శృంగారపు రంగాచారి, వెల్దండి సత్యనారాయణ, గుర్రపు రాజమొగిలి, బుర్ర రమేష్ గౌడ్, సరిగొమ్ముల రాజేందర్, మడిపడిగే సంపత్ కుమార్ పాల్గొన్నారు.