calender_icon.png 1 October, 2024 | 3:10 PM

వరద బాధితులకు సాయం ప్రకటించిన చిరంజీవి

04-09-2024 10:38:33 AM

హైదరాబాద్: ఇటీవల వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పద్మవిభూషణ్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హృదయపూర్వక ట్వీట్‌లో, అతను అనేక మంది అమాయకుల ప్రాణాలను కోల్పోవడంపై తన బాధను తెలియజేశాడు. తెలుగురాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం అన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో  ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు  కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చిరు ట్వీట్ పేర్కొన్నారు.