calender_icon.png 20 September, 2024 | 5:13 PM

అంగన్వాడి కేంద్రాలలో చదివే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలి

20-09-2024 03:17:16 PM

సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. పోషన్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు ఫ్రీ ప్రైమరీ విద్యను నాణ్యతగా అందించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి, జిల్లా వైద్యాధికారిణి డా. గాయత్రి దేవి పాల్గొన్నారు.