calender_icon.png 17 October, 2024 | 5:57 PM

అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను వచ్చేలా చూడాలి..

17-10-2024 03:38:47 PM

కామారెడ్డి (విజయక్రాంతి): అంగన్వాడి కేంద్రాలకు చిన్నారులను వచ్చేలా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆయాలను గ్రామస్తులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్ కోరారు. గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద వర్గాలకు చెందిన పిల్లలకు గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం అంగన్వాడి కేంద్రాల్లో జరుగుతుందని వాటిని సక్రమంగా వారికి అందించాలని సూచించారు. చిన్నారులకు ఆటపాటలు విద్యాబుద్ధులు నేర్పించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో 25 మంది పిల్లలను నమోదు చేయగా 17 మంది మాత్రమే అటెండెన్స్ ఉందని మిగతా పిల్లలను కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలన్నారు.

ఆరోగ్యవంతమైన పిల్లలకు బాలామృతం అందించాలని తెలిపారు. పోషకాహార లోపం కలిగిన పిల్లల్ని స్థానికులు దత్తత తీసుకొని న్యూట్రిషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల హాజరు వంటగదిలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలను శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అంగన్వాడి కేంద్రానికి రాని పిల్లలను వచ్చే విధంగా వారి పోషకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సిడిపిఓ, సూపర్వైజర్లతో కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదిలో శుభ్రంగా లేవని వాటిని శుభ్రపరచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. గతంలో పాఠశాలలో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్ ,గాంధారి తహసిల్దార్ సతీష్ రెడ్డి, సిడిపిఓ స్వరూప రాణి, సూపర్వైజర్ వినోదిని, మండల విద్యాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.