calender_icon.png 29 September, 2024 | 1:42 PM

'మా ఇల్లు మాకు కావాలి'.. ప్లకార్డులతో చిన్నారుల నిరసన

29-09-2024 11:10:28 AM

హైదరాబాద్ నగరంలోని హైదర్‌షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్లు కూల్చొద్దని ప్లకార్డులతో చిన్నారులు నిరసన తెలియజేస్తున్నారు. 'మా ఇల్లు మాకు కావాలి, మేము రోడ్డుపై పడతాం, మా ఇళ్లు కూల్చొద్దు' అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తుగ్లక్ రేవంత్, నీ అనవసర చర్యలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నావు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేవని మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూసి పరివాహక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారు కానీ రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో గరీబోంకో హటావో అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు. పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలి అని ఇందిరమ్మ చెబితే.. పేదలకు గూడు లేకుండా చేస్తున్నాడు తుగ్లక్ రేవంత్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.