calender_icon.png 30 September, 2024 | 9:10 PM

పిల్లలకు వాతలు పెట్టిన తల్లి

30-09-2024 06:38:52 PM

గల్ల పెట్టెను దొంగలించితే పనిష్మెంట్ ఇచ్చానని చెప్తున్న తల్లి

వేరే కారణాలతో కాల్చి వాతలు పెట్టిందన్న పిల్లలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం

కామారెడ్డి,(విజయక్రాంతి): పిల్లలను వేరే వ్యక్తులు ఏమన్నా అంటే తల్లిదండ్రులు చిరుబురులాడే ఈ కాలంలో కన్నతల్లి తన పిల్లలకు కాల్చి వాతలు పెట్టిన ఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లాలోని చిన్న కసాఫ్ గల్లిలో నివాసం ఉంటున్న రేణుక తన భర్త, పిల్లలు అంజలి, విష్ణులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి భర్త లేని సమయంలో తన ఇద్దరు పిల్లలు ఇంట్లో గళ్ళను దొంగిలించారని కాల్చి వాతలు పెట్టినట్లు రేణుక పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపింది.

రేణుక తన పిల్లలు అంజలి స్థానికంగా ఉన్న ముధము గల్లీలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. కుమారుడు విష్ణు అంగన్వాడి పాఠశాలలో అక్కడే చదువుకుంటున్నాడు. సోమవారం ఇద్దరి పిల్లల్ని పాఠశాలకు పంపించింది. పిల్లలపై ఉన్న వాతలను చూసిన ఉపాధ్యాయులు ప్రశ్నించారు. తల్లి కాల్చిందని పిల్లలు చెప్పడంతో పాఠశాల ఉపాధ్యాయులు 100 డయల్ కు ఫోన్ చేయడమే కాకుండా డీఎస్పీ నాగేశ్వరరావుకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ పోలీస్ సిబ్బందిని పాఠశాలకు పంపించారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయంపై పిల్లల తల్లి రేణుకను ఉపాధ్యాయులు ప్రశ్నించగా ఇంట్లో గల్ల పెట్టాను దొంగలించారని అందుకే భయం కోసం వార్తలు పెట్టినట్లు తెలిపారు. ఎంత కఠిన హృదయము తల్లి ఆ చిన్నారుల కు అంత పనిష్మెంటఅంటూ ఉపాధ్యాయులు తల్లితీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లి ఆ చిన్నారుల ను గరిటతో కాల్చి వాతలు పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు చిన్నారులను ప్రశ్నించగా తాము గల్లపెట్టను చోరీ చేయలేదని వేరే కారణాల వల్ల  తమను కాల్చి వాతలు పెట్టినట్లు రోదిస్తూ తెలిపారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది.