- శంషాబాద్ మండలంలో వందలాది మంది బాలకార్మికులు
- పట్టించుకోని సంబంధిత అధికారులు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 16: చట్టాలు ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఎలాంటి పనులు చేయవద్దని, బడుల్లో చదువుకోవాలనే నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. పోలీసు యంత్రాంగం ఆపరేషన్ స్మైల్ తదితర కార్యక్రమాలు నిర్వ హిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. శంషాబాద్ పట్టణంతో పాటు పెద్దగోల్కొండ, గొల్లపల్లి, రషీద్గూడ తదితర గ్రామాల్లో భారీగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రులకు అక్షరాస్యత లేకపోవడంతో వందలాది మం ది బాలబాలికలు పొట్టకూటి కోసం అందు లో కఠినమైన పనులు చేస్తున్నారు. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు బాలకార్మికులకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.