హుజూరాబాద్, సెప్టెంబరు 30: డెంగ్యూ లక్షణాలతో చిన్నారి మృతిచెందిన ఘటన హుజూరాబాద్ ప ట్టణంలో జరిగింది. హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతం లో నివాసముంటున్న రావుల వెం కటేశ్వర్లు దంపతుల కూతు రు రిషిత(10) గత నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండగా హుజూరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
రెండు రోజుల పాటు విపరీతమైన జ్వరం ఉండటంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆ సుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం సోమవా రం చిన్నారి మృతిచెందింది. డాక్టర్లు డెంగ్యూ లక్షణలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ విచారణ చేపట్టినట్లు సమాచారం.