21-02-2025 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): ఇక పోలీస్ స్టేషన్లలో చైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీ జోన్ -1 ఐ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పిల్లల పార్కును ఆవిష్క రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ చైల్ ఫ్రెండ్లీ కార్నర్ ద్వారా జిల్లాలో మంచి పోలీసింగ్ సేవలు అందించే విధంగా రూపకల్పన చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ ను ఇందులో సహాయ సహకారాలు అందిం చిన జిల్లా పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. పోలీస్ స్టేషన్ లు ఆహల్లా దకరమైన వాతావరణంలో ఉండే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కుటుంబ సమస్యలపై, వ్యక్తిగత ఇతర బాధాకరమైన పరిస్థితులలో ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వారి పిల్లలు అక్కడ ఎలాంటి జంకు లేకుండా సంతో షంగా ఆడుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పార్కులలో పిల్లలు ఇష్టపడే బొమ్మలు సీటింగ్ పిల్లలు ఇష్టంగా ఆడుకునే వస్తువులు ఉంటాయన్నారు.
కామారెడ్డి జిల్లాలో 23 పోలీస్ స్టేషన్లలో చైల్ ఫ్రెండ్లీ కార్నర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కామా రెడ్డి జిల్లాలో నీ ఎనిమిది పోలీస్ స్టేషన్లో ఈ చైల్ ఫ్రెండ్లీ కార్నర్ ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కామా రెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కామా రెడ్డి దేవునిపల్లి బిక్కనూరు పోలీస్ స్టేషన్లలో ఎల్లారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎల్లారెడ్డి సదాశివనగర్ గాంధారి బాన్సు వాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బాన్సు వాడ బిచ్కుంద పోలీస్ స్టేషన్లలో చైల్ ఫ్రెండ్లీ కార్నర్ ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు
మిగతా పోలీస్ స్టేషన్లలో సైతం ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో పార్కుల ఏర్పాటు కామారెడ్డి జిల్లాలోని జిల్లా ఎస్పీ సింధు శర్మ కృషి స్థానిక పోలీస్ అధికారుల సహకారాలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పిల్లల పార్కు లు ఏర్పాటు చేస్తే ఎంతో ఆహల్లాదకరంగా ఉంటుందన్నారు.
అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు కంట్రోలింగ్ కమాండెంట్ రూమ్ను ఐజి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీ సులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల క్రైమ్ రేటు తగ్గడంతో పాటు క్రైమ్ కు పాల్పడిన వారినీ సులువుగా పోలీసులు గుర్తించేం దుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయ న్నారు.
స్థానిక ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు వారి వీధులలో, గల్లీలలో, ఇండ్ల లో అమర్చుకుంటే నేరాలు తగ్గించవచ్చు అన్నారు. దొంగతనాలు హత్యలు వంటి సంఘటనలు అరికట్టవచ్చు అని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలువురు దాతలు సీసీ కెమెరాలు ఏర్పాటు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
సీసీ కెమె రాలు ఎంత ఎక్కువగా ఉంటే పట్టణమంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు అనంతరం పలువురు దాతలను ఐజి సన్మానించారు. ఎస్పీ సింధు శర్మ అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నర్సింహారెడ్డి, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, దేవునిపల్లి సిఐ రామన్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.