26-02-2025 03:38:59 PM
చిట్యాల: పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందిన విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారంలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిన్నెర శిరీష – రాజు దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు,కుమార్తె కీర్తన(7) ఉన్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా చిన్నారిని పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల ప్రభుత్వ దవఖానకు తీసుకువెళ్ళారు. వైద్యుల సూచనల మేరకు భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లారూ ముద్దుగా పెంచుకున్న బిడ్డ కండ్లముందే కన్ను మూయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరవుతున్నారు.