calender_icon.png 22 September, 2024 | 4:24 AM

పాముకాటుతో చిన్నారి మృతి

22-09-2024 01:47:44 AM

నల్లగొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : పాముకాటుతో ఐదేండ్ల చిన్నారి మృతిచెందిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్లలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరంటోతు కిషన్‌నాయక్ గంగ దంపతులు పొగిళ్లలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె. పేరు పవిత్ర (5). కిషన్‌నాయక్ శనివారం తెల్లవారుజామున ఇంట్లో పామును చూసి వెంటనే కర్రతో కొట్టి చంపాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను దేవరకొండ  ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మృతిచెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.