calender_icon.png 30 September, 2024 | 3:03 PM

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

30-09-2024 12:05:26 PM

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్కూల్ బస్ కిందపడి నర్సరీ చదువుతున్న ఓ చిన్నారి మృతి చెందిన విషాధ ఘటన సోమవారం చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నామాపూర్ గ్రామానికి చెందిన సల్కం భూమయ్య- వెంకటవ్వ కూతురు మనోజ్ఞ (3) ముస్తాబాద్ మండలకేంద్రంలో మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నర్సరీ చదువుతుంది. పాఠశాల వద్ద జరిగిన ప్రమాదంలో బస్ టైర్ పాప తలపై నుండి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. బాలిక తల్లి ఇంటి వద్ద అంటూ వ్యవసాయ పనులు  చేస్తూ ఉండగా  ఉపాధి నిమిత్తం తండ్రి గల్ఫ్ లో  ఉన్నాడు. చిన్నారి మృతితో విషాదం నెలకొంది.