calender_icon.png 24 October, 2024 | 2:00 PM

డీసీఎం కిందపడి చిన్నారి మృతి

17-09-2024 03:50:13 AM

వాహనాన్ని నడిపింది బాలుడి తండ్రే

రాజేంద్రనగర్, సెప్టెంబర్16: పొరపాటు.. ఓ పసివాడి ప్రాణం తీసింది. సాక్షాత్తు తండ్రి నడుపుతున్న డీసీఎం టైర్ కిందపడి కొడుకు ప్రాణం పోయిన విషాదకర సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్ని గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నా డు. ఇటుకలు తయారు చేసే బట్టీ వద్ద డీసీఎం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి కుమారుడు విజ్ఞేష్(3) ఉన్నాడు.

సోమవారం మధ్యాహ్నం కృష్ణ నడిపే డీసీఎం ముందు బాలుడు ఆడుకుంటున్నా డు. ఇది గమనించని కృష్ణ డీసీఎంను ముందుకు తీస్తుండగా విజ్ఙేష్ డీసీఎం టైర్ కింద పడిపోయా డు. గమనించి వెంటనే వాహనా న్ని పక్కకు తీయగా.. బాలుడికి గాయాలు కనిపించకపోయినప్పటీకీ ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి అక్కడికక్కడే విజ్ఞేష్ చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు తాను నడుపుతున్న డీసీఎం కిందపడి చనిపోవడంతో కృష్ణ గుండెలవిసేలా రోదించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.