18-03-2025 01:10:06 AM
గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే చందర్ గోదావరి తల్లి కన్నీటి గోస’ మహాపాదయాత్ర ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్
మంథని మార్చి 17(విజయ క్రాంతి): వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ బీల్లకు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ అని, కాళేశ్వరం ప్రాజెక్టును కడితే కడుపు మంటతో మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీటి గోసకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు.
కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టేందుకోసం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్గా చేపట్టిన ‘గోదావరి తల్లి కన్నీటి గోస’ మహాపాదయాత్ర ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 22వరకు ఉద్యమాల పురిటి గడ్డ నుంచి గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి 180కిలో మీటర్ల మహా పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు.
రామగుండంలో అగ్గి రాచుకుంటుందని, ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందన్నారు. ఈ మహా పాదయాత్రలో అన్నదాతల కష్టాలను, కన్నీళ్లను ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిపోయిన కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నీళ్లను తుడిస్తే, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆ్ప అక్కసుతో కాళేశ్వరం కూలిందని నెపం మోపి నీటిని దిగువకు వదిలి తెలంగాణను ఎండబెట్టిందని విమర్శించారు.
కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బరాజ్లు, 15రిజర్వాయర్లు, 19సబ్ స్టేషన్లు, 21పంపు హౌస్లు, 200 కిలో మీటర్ల సొరంగాలు, 1530కిలో మీటర్ల గ్రావిటీ కెనాళ్లు, 98కిలో మీటర్ల ప్రెజర్ మెంట్స్, 141టీఎంసీల కెపాసిటీ ఉన్న 530మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం, 240టీఎంసీల ఉపయోగంతో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించారని, కాళేశ్వరం ఎండబెట్టడం వల్లే తెలంగాణలో రైతన్నల పంట పొలాలు ఎండుతున్నాయని ప్రజలకు వివరించే విధంగా ఈ 180కిలో మీటర్ల యాత్ర సాగుతుందన్నారు. పాదయాత్ర కు రూపకల్పన చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.