19-02-2025 07:10:46 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో బుధవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శోభాయాత్రను హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. కన్నాల శివాంజనేయ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాత బస్టాండ్, రామ టాకీస్ ల మీదుగా కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వరకు జోరు నినాదాలతో కొనసాగింది. మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన పరాక్రమవంతుడు శివాజీ అని కొనియాడారు. దేశంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించిన మహనీయుడన్నారు.