- చెస్ ఒలింపియాడ్లో స్వర్ణాలు నెగ్గిన భారత గ్రాండ్ మాస్టర్లు
- పురుషులతో పాటు సత్తా చాటిన మహిళా మాస్టర్లు
బుడాపెస్ట్: 45వ చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. ఓపెన్ కేటగిరీలో పురుషులతో పాటు, మహిళల కేటగిరీలో లేడీ గ్రాండ్ మాస్టర్లు కూడా స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. భారత పురుషుల, మహిళల జట్లు చెస్ ఒలింపియాడ్లో స్వర్ణాలు నెగ్గడం ఇదే తొలిసారి. 11వ రౌండ్లో పురుషుల జట్టు స్లొవేనియాను ఓడించగా.. మహిళల జట్టు అజర్బైజాన్కు చెక్ పెట్టింది. పురుషుల జట్టులో గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్, అర్జున్, హరికృష్ణ ఉండగా.. మహిళల జట్టులో దివ్య, వంతిక, హరిక, వైశాలి, తానియా ఉన్నారు. పురుషులు, మహిళల జట్లు స్వర్ణాలు గెలుచుకోగా.. గుకేశ్, అర్జున్, దివ్య, వంతిక వ్యక్తిగత స్వర్ణాలు గెలవడం గమనార్హం. గుకేశ్ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకపోవడం విశేషం.