calender_icon.png 23 September, 2024 | 1:40 PM

వెంకటస్వామిగౌడ్‌ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

23-09-2024 11:16:01 AM

దుబ్బాక,(విజయక్రాంతి): అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో పాతూరి గోపవ్వ ఇటీవల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక బ్లాక్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షడు అక్కం స్వామి, నాయకులు భూస నిరంజన్ రెడ్డి, యెన్నం భూపాల్ రెడ్డి, మాజీ టెలికం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.