చెన్నై: పొల్లాచ్చి నుంచి కోయంబత్తూర్కు 50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ సత్వర చర్యతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఒతక్కల్ మండపం సమీపంలో ఈ సంఘటన జరిగింది. డ్రైవరు పొగలు రావడంతో వెంటనే ఆగి వాహనం ఆపాడు. ప్రయాణికులను సురక్షితంగా బస్సు నుంచి దింపిన తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్కు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పోలీసులు తెలిపారు.