26-04-2025 11:03:12 AM
చేగుంట, విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పలు దాబాల్లో మెదక్ జిల్లా ఎస్పి ఆదేశాను సారము చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి (Chegunta SI Chaitanya Kumar Reddy) ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అక్షిత దాదా, షేర్ పంజాబీ దాబాలలో నార్కోటిక్ డాగ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దాబాలలో దేశము జరుగుతున్నటువంటి పరిణామాల దుష్ట, దాబాలలో ఎవరైనా అనుమానం వచ్చిన వ్యక్తులు వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో సమాచార ఇవ్వాలని, దాబాలలో ఎవరైనా మత్తు పదార్థాలు డ్రగ్స్ , గంజాయి, అమ్మిన తాగిన, దాబాలలో సెట్టింగ్ చేసిన చట్టరీత్యా వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు ,ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు