- శ్రీవారి మెట్టు వద్ద కుక్కలపై దాడి
- సీసీ టీవీల్లో రికార్డయిన దృశ్యాలు
తిరుపతి, సెప్టెంబర్ 29: తిరుమల మెట్లమార్గంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తిరుమల చేరేందు కు ప్రధాన మార్గా ల్లో ఒకటైన శ్రీవారి మెట్టు వద్ద చిరుత కనిపించడం మరోసారి భక్తులను భయాందో ళనకు గురి చేసింది. శనివారం రాత్రి కంట్రోల్ రూం వద్ద చిరుతను చూసిన కొన్ని కుక్కలు దాన్ని వెంటాడాయి.
అయితే కుక్కలపై చిరుత ప్రతిదాడికి యత్నించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుత సంచారం గురించి కంట్రోల్ రూం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. క్రూర జంతువుల సంచారం తో రాత్రివేళల్లో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు.