calender_icon.png 23 October, 2024 | 3:00 PM

విద్యుదాఘతంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందజేత

29-08-2024 03:07:26 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ గత ఏడాది విద్యుదాఘాతంతో మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేసిన అధికారులు బాధిత కుటుంబానికి రూ.5లక్షల చెక్కును డిఈఈ జీవరత్నం గురువారం  అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరుణ ,మాజీ ఎంపీటీసీ రవీందర్,ఏ డి ఈ వెంకటేశ్వర్లు,సిబ్బంది శ్రీనివాస్,నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు