calender_icon.png 27 February, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ డ్యామ్ కు గండి కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

27-02-2025 03:32:28 PM

చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం(Chityala Mandal) నవాబుపేట గ్రామ శివారులోని చలివాగుపై నిర్మించిన చెక్ డ్యాంకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల శివారులోని పంట పొలాలకు చలి వాగు ద్వారా సాగు నీరు అందుతుంది.చలివాగులో నీరు నిల్వ ఉంటే చిట్యాల మండలం నవాబుపేట పరిసర ప్రాంతాల రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటారు.కాగా, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న దృష్ట్యా టేకుమట్ల శివారు రైతులు చలివాగుకు గండి కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. పలుమార్లు సాగు నీటి సమస్యపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి టేకుమట్ల రైతులు తీసుకెళ్లినా దాటవేసినట్లు రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఆగ్రహంతో చలివాగుకు గండి కొట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.