calender_icon.png 9 October, 2024 | 3:57 AM

మంత్రాల పేరుతో మోసం

09-10-2024 01:45:59 AM

వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు 

చార్మినార్, అక్టోబర్ 8: చేతబడి పేరుతో ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న కేటుగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమో దైన ఉన్న బహదూర్‌పురా హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ కలీమ్ ఈ మధ్య కొత్త అవతారం ఎత్తాడు. తన దగ్గరకు వచ్చేవారికి మంత్రాలతో మంచి చేస్తానని, అలాగే ఎవరితోనైనా గొడవలు ఉంటే వారి అంతు చూస్తానని ప్రజలను నమ్మిస్తున్నాడు.

వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో మంగళవారం కలీమ్ ఇంటి పై దాడి చేశారు. చేతుబడుల కోసం ఉపయోగిస్తున్న వస్తువులను స్వాధీనం చేసు కున్నారు. కలీమ్ బాబాపై కేసు నమో దు చేసి అరెస్ట్ చేశారు.