calender_icon.png 6 October, 2024 | 1:33 AM

ప్రేమ,పెళ్లి పేరుతో మోసం

05-10-2024 12:20:50 AM

యువకుడిపై ఎల్బీ నగర్ పీఎస్‌లో యువతి ఫిర్యాదు

ఎల్బీనగర్, అక్టోబర్ 4: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఒక హోటల్‌లో అల్వాల్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు బౌన్సర్‌గా పని చేస్తున్నాడు.

అదే హోటల్‌లో నాగోల్ ప్రాంతా నికి చెందిన ఒక యువతి పనిచేస్తోంది. సాయికుమార్ సదరు యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొదట్లో యువతి తిరస్కరించగా పదేపదే పెళ్లి ప్రతిపాదన చేస్తుండడంతో చివరికి సాయికుమార్ ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలోనే సదరు యువతిని ఎల్బీ నగర్‌లో ఓ హోటల్‌కు తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు.

2024 ఏప్రిల్‌లో యువతి ఇంటికి వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో పూర్తిగా నమ్మిన యువతి సాయికుమార్‌తో మరింత సన్నిహితంగా మెలిగింది. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకురాగా సాయికుమార్ తప్పించుకుంటున్నా డు. తనన ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సాయికుమార్ పలుమార్లు లైంగికదాడి చేశాడని బాధితురాలు గురువారం రాత్రి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.