calender_icon.png 21 September, 2024 | 10:10 AM

సీటెట్ షెడ్యూల్‌లో మార్పు

21-09-2024 01:23:40 AM

డిసెంబర్ 15న నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 20          (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు సీబీఎస్‌ఈ కీలక ప్రకటన చేసింది. సీటెట్ పరీక్షను డిసెంబర్ 15న నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో తొలుత డిసెంబర్ 1న నిర్వహిస్తామని తెలిపింది. కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పరీక్షను ఓఎమ్‌ఆర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 136 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. ఒకవేళ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆయా పట్టణాల్లో డిసెంబర్ 14న కూడా పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్షకు సంబం ధించి ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 దరఖాస్తులు స్వీకరించనున్నారు.